రఘురామపై మరోసారి స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు

by  |
రఘురామపై మరోసారి స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు వ్యవహారంపై ఆ పార్టీ ఎంపీలు మరోసారి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు. రఘురామరాజుపై వేటు వేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్పీకర్‌కు ఆధారాలను అందించారు. వెంటనే రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని కోరారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్‌లు ఉన్నారు.

వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామరాజు పాల్పడుతున్నారని, అనర్హత వేటు వేయాలనీ మరోసారి స్పీకర్‌ను కోరామని వైసీపీ ఎంపీలు తెలిపారు. గతంలో దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు అందజేశామన్నారు. రఘురామరాజు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలనీ మరోసారి కోరామన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed