అరుదైన వ్యాధితో చంద్రబాబు బాధపడుతున్నారు: విజయసాయిరెడ్డి

by  |
అరుదైన వ్యాధితో చంద్రబాబు బాధపడుతున్నారు: విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే తాజాగా ఓ ట్వీట్ చేశారు. ‘ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నేనెవరికీ భయపడను, నన్నెవరూ భయపెట్టలేరంటూ గింజుకుంటున్నాడు. చంద్రబాబూ… నువ్వో చచ్చిన విషసర్పానివి. నిన్నెవరూ భయపెట్టడం లేదు. అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్నావు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించాక అది మరింత ముదిరింది.’ అంటూ విజయసాయిరెడ్డి ఘాటు క్యాప్షన్ పెట్టారు.


Next Story