పరాకాష్టకు జూమ్ బాబుల శాడిజం

by  |
పరాకాష్టకు జూమ్ బాబుల శాడిజం
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘లోకేశం.. మీ లిటిగేషన్ రాజకీయాలు ఎవరికి తెలీవు? కానీ, మీ శాడిజం పరాకాష్టకు చేరింది. చివరికి పేదల ఇళ్ల స్థలాల పంపిణీని కూడా అడ్డుకుంటున్నారు. ఎందుకు? అమరావతి అవినీతి పుట్ట కూలిపోతుందనా? ఏది ఎమైనా పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకున్న ప్రతిపక్షంగా మీరు చరిత్రలో నిలిచిపోతారు జూమ్ బాబులు.’’ అంటూ ట్వీట్టర్‌లో ఓ రేంజ్‌లో విమర్శలు చేశారు. కాగా, పేదలకు ఇళ్ల స్థలాల కోసం తూర్పుగోదావరిలో జిల్లాలో సేకరించిన ఆవ భూములపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed