ఎన్ని చేసినా నువ్వు రావణాసురునివే: విజయసాయిరెడ్డి

by  |
ఎన్ని చేసినా నువ్వు రావణాసురునివే: విజయసాయిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. గుడిలపై దాడులు అధికార పార్టీ పనేనని ప్రతిపక్షాలు.. ప్రతిపక్షాలే చేస్తున్నాయని అధికార పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక ఇదే వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘శ్రీరాముని విగ్రహాన్ని మీరు మీ గ్యాంగ్ ధ్వంసం చేసి ఆ విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటనలేంటి బాబూ?
రామతీర్థం రామునితో రాజకీయాలు చేస్తావా? ఎన్ని చేసినా నువ్వు రావణాసురునివే. జనం ఛీదరించుకోవడంతో ఇప్పుడు మతాల మధ్య మారణహోమం సృష్టించాలని అనుకుంటున్నావా ? అంటూ చంద్రబాబును ట్విట్టర్ వేదికగా నిలదీశారు.


Next Story

Most Viewed