ఆర్ఆర్ఆర్ ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారు : వైసీపీ ఎమ్మెల్యే

by  |
YCP MLA Jogi Ramesh
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రఘురామపై కక్షసాధింపులకు పాల్పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన ఒక ఉన్మాదిలా, ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిరోజూ పనిగట్టుకొని ముఖ్యమంత్రి జగన్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.

మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే.. అని చంద్రబాబు, లోకేష్‌ను కూడా వలబోం అని హెచ్చరించారు. అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయ్యారు.. ధూళిపాళ్ల రైతులడబ్బు దోచుకున్నారు, కొల్లు రవీంద్రపై హత్యకేసు ఉందని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్400 పేరుతో ప్రజలను భయపెట్టారని అన్నారు.

Next Story

Most Viewed