‘ఫ్యాక్షన్ రాజకీయాలకే వైసీపీ పరిమితం’

by  |
‘ఫ్యాక్షన్ రాజకీయాలకే వైసీపీ పరిమితం’
X

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాలకే పరిమితమైందనీ, తొమ్మిది నెలల్లో ఆ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమని జనసేన నాయకులు నాదేండ్ల మనోహర్ విమర్శించారు. అభివృద్ధి ఆపేసి రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని ముంచేశారని మండిపడ్డారు. కేంద్రం నుంచి విశాఖ ఏజెన్సీకి ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఉత్తరాంధ్రలో పేదల ఇళ్ల పట్టాల భూసమీకరణపై తమకు అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. దీనిపై వారంలో నివేదిక ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరినట్టు వెల్లడించారు. వైసీపీ భూదందాలపై పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉందనీ, అవసరమైతే భూసమీకరణ ప్రాంతాల్లో తమ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని మనోహర్ స్పష్టం చేశారు.

Tags: janasena, pawan kalyan, nadendla manohar, ycp, faction politics, visakha, agency, land mafia,

Next Story