రోజా.. మీరు క్షేమంగా రావాలి

by  |
రోజా.. మీరు క్షేమంగా రావాలి
X

దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు రోజా భర్త సెల్వమణి వెల్లడించారు. ఈ నేపథ్యంలో రోజా త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు మహా మృత్యుంజయ హోమాన్ని జరిపించారు. అలానే ఆలయాల్లో పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ రోజా త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నామని తెలిపారు.

Next Story