వారిని ఓటు బ్యాంకుగానే చుశారు : సుచరిత

by  |
వారిని ఓటు బ్యాంకుగానే చుశారు : సుచరిత
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నగరపాలెంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మంత్రి సుచరిత సోమవారం పూలమాలలు వేసి, ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. గతంలో బీసీలను ఓటు బ్యాంకుగా చుశారని విమర్శించారు. అనంతరం మంత్రి రంగనాథ్ రాజు మాట్టాడుతూ.. బీసీల్లో ఎన్ని కులాలున్నాయన్న సంగతి ఎవరికీ తెలియదు అని ఎద్దేవా చేశారు. బీసీల సంపూర్ణ అభివృద్ధే వైపీపీ ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు.


Next Story