టీడీపీ జోకర్ల పార్టీ: సజ్జల

by  |
టీడీపీ జోకర్ల పార్టీ: సజ్జల
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు యావత్ ప్రపంచం గుర్తిస్తోందని వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ అన్నారు. అటువంటిది జోకర్‌ లాగా మధ్యలో చంద్రబాబు వచ్చి కొవిడ్ నిర్మూలిస్తామనడం హాస్యస్పదమన్నారు. జూమ్ యాప్‌లో డాక్టర్లతో మీటింగ్‌లు పెట్టి చర్చిస్తే కరోనా అంతం కాదని చురకలు వేశారు.

ఇటువంటి పనులు మానేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నించాలని సజ్జల సూచించారు. టీడీపీ పార్టీ జోకర్ల పార్టీ అంటూ సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. కరోనా పై ఏదైనా చెబితే సీరియస్ అంశంగా ఉండాలే తప్ప.. చిల్లర వ్యవహారంగా చేయకూడదని సజ్జల అన్నారు.



Next Story

Most Viewed