‘ఆర్ఆర్ఆర్‌పై అనర్హత వేటు వేయాలి’

by  |
‘ఆర్ఆర్ఆర్‌పై అనర్హత వేటు వేయాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ ఎంపీలతో సీఎం జగన్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన విషయాలపై ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు. అనంతరం ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ… రఘురామకృష్ణరాజు పూర్తిగా ప్రతిపక్ష ప్రభావంలో ఉన్నారన్నారు.

స్పీకర్‌ను కలిసి ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా, పోలవరం నిధులు, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ నిధులు, అంతేగాకుడా ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు కేంద్ర సాయం కోరుతామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాయని, రథం విషయంలో మతకలహాలు సృష్టించేలా మాట్లాడుతున్నారని మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also..

‘ఆ రైతుల త్యాగాలను పరిగణలోకి తీసుకోవాలి’


Next Story