ఇచ్చిన మాట ప్రకారం.. పనిచేస్తున్నాం

by  |
ఇచ్చిన మాట ప్రకారం.. పనిచేస్తున్నాం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్ష టీడీపీ పార్టీపై వైసీపీ నేత మల్లాది విష్ణు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ… బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story