చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు జగన్ చెల్లించారు !

by  |
చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు జగన్ చెల్లించారు !
X

దిశ, విశాఖపట్నం: దేశంలో రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది వైసీపీ ప్రభుత్వమేనని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ లక్ష రుణం పొందిన రైతులకు సున్నావడ్డీ రాయితీ అందించడం ఇదే తొలిసారని, గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.1,180కోట్ల బకాయిలను సీఎం జగన్ చెల్లించారన్నారు. రైతుభరోసా, వైఎస్సార్ జలకళ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్న తొలిప్రభుత్వం ఇదేనని, రైతుభరోసా కేంద్రాల రూపంలో రైతులకు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేశారన్నారు. రైతాంగానికి జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను రైతులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు.

Next Story

Most Viewed