వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

by  |
sajjala ramakrishna reddy
X

దిశ, ఏపీ బ్యూరో: స్థానిక సంస్థల కోటాలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం అభ్యర్థులను ప్రకటించారు. వివరాలను పరిశీలిస్తే.. ఇందుకూరు రఘురాజు(విజయనగరం), వరుదు కళ్యాణి(విశాఖపట్నం), వంశీ కృష్ణ యాదవ్(విశాఖపట్నం), అనంత ఉదయ్ భాస్కర్(తూర్పుగోదావరి), మొండితోక అరుణ్‌కుమార్(కృష్ణా), తలశిల రఘురాం (కృష్ణా), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(గుంటూరు), మూరుగుడు హన్మంతరావు(గుంటూరు), తూమటి మాధవరావు(ప్రకాశం), కృష్ణ రాఘవ జయేంద్ర భరత్‌( చిత్తూరు), వై. శివరామిరెడ్డి(అనంతపురం)లను అధిష్టానం ప్రకటించింది.

స్థానిక సంస్థల కోటాలో మెుత్తం 11 స్థానాలకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించింది. ఇకపోతే ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన ముగ్గురు అభ్యర్థులను సైతం వైసీపీ ఇటీవలే ప్రకటించింది. మెుత్తం 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు.. కాపు రెండు, కమ్మ రెండు, రెడ్డి రెండు, క్షత్రియు లకు ఒక్కో స్థానాన్ని కేటాయించారు.


Next Story

Most Viewed