- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జంటగా ‘నోటా’ చిత్రంలో నటించిన హీరోయిన్ యషికా ఆనంద్. ఆమె ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. కాగా మూడు నెలలుగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటోంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు తను క్యూర్ అవుతున్నట్లు అభిమానులకు తెలిజేయాలనే ప్రయత్నంలో భాగంగా.. ఒక్కో అడుగు వేస్తూ నడిచే ప్రయత్నం చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ‘ఆసుపత్రిలో వైద్యుల సాయంతో నడవడం ప్రాక్టీస్ చేస్తున్నా’ అని తెలిపిన నటి.. తనకు తగిలిన గాయాలను చూపిస్తూ ఈ బాధను భరించలేకపోతున్నానని చెప్పింది. ఇలాంటి పరిస్థితి శత్రువుకు కూడా రాకూడదని కోరుకుంది. కాగా ఆమె అవస్థలు చూసిన నెటిజన్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.
https://www.instagram.com/reel/CVkpT4lBIo6/?utm_source=ig_web_copy_link