యాదాద్రికి కరోనా ఎఫెక్ట్.. మరో 35 మందికి పాజిటివ్

by  |
యాదాద్రికి కరోనా ఎఫెక్ట్.. మరో 35 మందికి పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా కరోనా కలకలం సృష్టించింది.

శనివారం 30 మంది అర్చకులకు పాజిటివ్ నిర్దారణ కాగా, ఆదివారం మరో 35 మందికి పైగా అర్చకులు, సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు. మిగతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాదాద్రిపై కరోనా పంజా విసరడంతో భక్తులకు స్వామి వారి దర్శనాన్ని రద్దుచేశారు.



Next Story

Most Viewed