యాదాద్రి ఆలయ అర్చకుడికి కరోనా

by  |
యాదాద్రి ఆలయ అర్చకుడికి కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినట్టు పట్టి మళ్లీ పుంజుకుంటోంది. శనివారం రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌‌లో పలు మండలాల్లో భారీ కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. తాజాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్ట ఆలయంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతేగాకుండా మరో అర్చకుడు కూడా జ్వరం, జలుబుతో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. దీంతో ఆలయ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed