యాదాద్రి దేవస్థాన ఆచార్యులకు బెదిరింపు కాల్

by  |
యాదాద్రి దేవస్థాన ఆచార్యులకు బెదిరింపు కాల్
X

దిశ, నల్లగొండ: యాదగిరిగుట్ట దేవస్థాన ఆచార్యులు సందుగుల రాఘవాచార్యులకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. దేవస్థాన దస్త్రాల విషయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆచార్యులకు ఫోన్​చేసి బెదిరించినట్టు ఫిర్యాదు అందిందన్నారు. వారం రోజుల కిందట..ఉదయం ఆలయానికి వెళ్లి నిత్య కైంకర్యాలు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లిన రాఘవా చార్యులకు రాత్రి 2 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారాన్ని దేవాదాయ శాఖ కమిషనర్​కు ఫిర్యాదు చేస్తానని యాదగిరి గుట్ట దేవస్థాన ఆచార్యులు తెలిపారు.

tags : yadadri temple priest, unknown person, call, warning, documents


Next Story