- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆలేరు: వట పత్ర శాయికి వరహాల లాలి అంటూ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని అలంకరించి తిరుమాడ వీధులలో ఊరేగింపు చేశారు. యాదాద్రి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లను వటపత్ర శాయి, సాయం కాలం వేళ పొన్న వాహన సేవలో అలంకారం చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామి వారు ఆవు పాలు సేవించి.. మర్రి అకుపై నిద్రించి లోకంలో జరుగుతున్న చిత్ర విచిత్రాలను చిన్నపిల్లవాని వలె చూస్తున్నారని.. ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నరసింహ మూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు నల్లంతి ఘల్ లక్ష్మీనరసింహా చార్యులు, మోహనా చార్యులు, వెంకటా చార్యులు, రంగాచార్యులు, ఆలయ అధికారులు గజ్వేల్ రమేష్ బాబు, వాసం వెంకటేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story