పెచ్చులూడిన యాదాద్రి బాలాలయం పైకప్పు

by  |
పెచ్చులూడిన యాదాద్రి బాలాలయం పైకప్పు
X

దిశ, నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి ఆలయాన్ని పునర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో పైకప్పు పెచ్చులూడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి తడిసిన పైకప్పు… రెండు చోట్ల పెచ్చులూడి కింద పడింది. ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. గతంలోనూ బాలాలయంలోకి వర్షపు నీరు చేరిన సంగతి తెలిసిందే. యాదాద్రి ప్రధానాలయాన్ని పునర్ నిర్మిస్తున్న క్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా… బాలాలయాన్ని రెండేళ్లపాటు నిలిచేలా కట్టారు. ఆలయ పునర్నిర్మాణం అనుకున్న సమయంలో పూర్తికాకపోవటంతో ఇప్పటికీ స్వామివారి నిత్య కైంకర్యాలు, దర్శనాలు బాలాలయంలోనే జరుగుతున్నాయి.



Next Story