లంచ్ బ్రేక్: టీమిండియాదే పైచేయి

by  |
లంచ్ బ్రేక్: టీమిండియాదే పైచేయి
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు చాంఫియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా పైచేయి సాధిస్తోంది. ఇవాళ ఆట ప్రారంభం సమయానికి వర్షం పడుతుండటంతో.. ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. 101/2 రన్స్‌తో ఇవాళ న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించగా.. లంచ్ బ్రేక్ సమయానికి భారత బౌలర్ల దెబ్బకు నిలబడలేకపోయింది. లంచ్ సమయానికి 135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశాడు.

Next Story