ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. ‘సింధు’ సీన్ రిపీట్

by  |
ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. ‘సింధు’ సీన్ రిపీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్య పతకం సాధించాడు. కజకిస్తాన్ ఆటగాడు నియాజ్ బెకోవ్ పై 8-0 తేడాతో పూనియా భారీ విజయం సాధించాడు. 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా మెడల్ సాధించడంతో ఇప్పటివరకు భారత్‌కు మొత్తంగా 6 పతకాలు వచ్చాయి. అందులో రెండు సిల్వర్ ఉండగా, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇదిలాఉండా, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు లానే సెమీస్‌లో ఓడిపోయిన భజరంగ్ కాంస్య పతక విభాగంలో సత్తా చాటి దేశానికి మరో మెడల్ అందించాడు. పూనియా కాంస్య పతకం సాధించడం పట్ల ఆయన స్వగ్రామంలో సంతోషం వెల్లివిరిసింది.

Next Story

Most Viewed