- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'ప్రైవేటుగా చర్చిస్తే బెస్ట్'.. భారత్కు కెనడా ప్రతిపాదన
by Disha Web Desk 13 |
X
ఒట్టావా : ఈనెల పదో తేదీకల్లా 41 మంది దౌత్యవేత్తలను ఢిల్లీ నుంచి వెనక్కి పిలిపించుకోవాలని భారత్ అల్టిమేటం ఇచ్చిందంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో కెనడా స్పందించింది. దౌత్య సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి భారత్తో ప్రైవేటుగా చర్చలు జరపాలని తాము కోరుకుంటున్నామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అన్నారు. ‘‘ప్రైవేటుగా జరిగే దౌత్య చర్చలు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. వాటిలో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించే వీలు ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
భారత్లోని కెనడా దౌత్యవేత్తల భద్రతను తాము సీరియస్గా తీసుకుంటామని స్పష్టం చేశారు. తమ దేశం భారత్తో ఉద్రిక్తతలను పెంచుకోవాలని అనుకోవడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం కామెంట్స్ చేసిన నేపథ్యంలో తాజాగా కెనడా మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Next Story