కెనడాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు భారతీయుల మృతి

by Dishanational2 |
కెనడాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు భారతీయుల మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. గ్రేటర్ టొరంటోని బ్రాంఫ్టన్ పట్టణంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిని రితిక్ ఛబ్రా(23), అతని తమ్ముడు రోహన్(22), గౌరవ్ ఫాస్గే(24)గా గుర్తించారు. అతి ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురూ బ్రాంప్టన్‌లోని ఓ అపార్ట్‌మెంటులో ఉంటున్నట్టు వెల్లడించారు. సోదరులైన ఛబ్రా, రోహన్‌లు సెనెకా కళాశాల నుంచి ఇటీవలే డిగ్రీ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అంతేగాక వీరిద్దరూ స్థానికంగా ఉన్న ఓ సెలూన్ షాపులో పని చేస్తున్నారు. పని అయిపోయాక వారు నివసించే ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలోనే యాక్సిడెంట్ అయినట్టు సమాచారం. కాగా, చబ్రా సోదరులు చండీగఢ్‌కు చెందినవారు కాగా.. ఫాస్గే పూణేకు చెందిన వ్యక్తి. వారి మృత దేహాలను భారత్‌కు రప్పించడానికి స్నేహితులు ఆన్ లైన్ నిధుల సేకరణ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed