China: చైనాలో భారీ భూకంపం

by Disha Web Desk 16 |
China: చైనాలో భారీ భూకంపం
X

బీజింగ్‌: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని లుండింగ్ కౌంటీలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 21 మంది మరణించారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు హిందూకుష్ పర్వతాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. చెంగ్దు పట్టణంలో భూకంపం వినాశనం సృష్టించగా.. ఉత్తర పాక్‌లోని పలు చోట్ల భూమి కంపించినట్లు సమాచారం. అయితే ఈ భూకంపం వల్ల ఎంత నష్టం వాటిల్లిందనే విషయంపై ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు చెప్పారు. టిబెట్‌కు ఆనుకుని ఉన్న సిచువాన్ ప్రావిన్స్‌లో భూకంపాలు ఎక్కువగా నమోదవుతాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, 2008లో సిచువాన్‌లోనే 8.2 తీవ్రతో భారీ భూకంపం వచ్చింది. అప్పుడు దాదాపు 69 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో వచ్చిన భూకంపం వల్ల 200 మంది చనిపోయారు.


Next Story

Most Viewed