ప్రధాని మోడీకి అరుదైన ఆ గౌరవం.. ఆ అవార్డుతో సత్కరించిన ఈజిప్టు ప్రభుత్వం

by Dishafeatures2 |
ప్రధాని మోడీకి అరుదైన ఆ గౌరవం.. ఆ అవార్డుతో సత్కరించిన ఈజిప్టు ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ ఇటీవలే అమెరికా స్టేట్ విజిట్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ భారత ప్రధాని మోడీని వైట్ హౌజ్ కు ఆహ్వానించి అపూర్వమైన స్వాగతంతో సకల మర్యాదలు చేశారు. ఇక అమెరికా పర్యటన అనంతరం మోడీ ఈజిప్టుకు వెళ్లారు. కాగా మోడీకి అక్కడ అరుదైన గౌరవం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఆదివారం ఈజిప్టు అత్యున్నత రాష్ట్ర గౌరవం ‘ది ఆర్డర్ ఆఫ్ ది నైల్’ లభించింది.

కైరోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి కైరోలో ప్రధాని మోడీకి అవార్డును అందజేశారు. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక మోడీ పీఎం అయ్యాక తొలిసారి ఈజిప్టులో పర్యటించగా.. అక్కడి ప్రభుత్వం ఆయనకు సాదర స్వాగతం పలికింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల నేతల మధ్య పలు వాణిజ్య ఒప్పందం జరిగింది.


Next Story