- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చైనా వస్తువులే కాదు మిస్సైల్స్ కూడా నకిలినే.. సోషల్ మీడియాలో ట్రోల్స్

దిశ, వెబ్ డెస్క్: భారత్-పాకిస్తాన్ మధ్య సంఘర్షణ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో చైనాపై దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు చైనా వస్తులు అంటేనే తక్కువ ధర తక్కువ మన్నికకు పెట్టింది పేరుగా నిలిచాయి. ఏ ఒరిజినల్ బ్రాండ్ కైన చైనా ఈజీగా నకిలీ తయారు చేసి ఛీఫ్ గా అందుబాటులోకి తెస్తుంది. అయితే దాని క్వాలిటీ, పనితనం కూడా అదేవిధంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా భారత్, పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల్లో చైనా వస్తువులపై దారుణమైన ట్రోల్స్ (Cruel trolls) వస్తున్నాయి.
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ పై భారత్ దాడి చేసింది. ఈ దాడికి వ్యతిరేకంగా పాక్ భారత్ పై డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడి చేసింది. అయితే ఈ మిస్సైల్స్ను భారత సునాయాసంగా తిప్పికొట్టింది. ఇదిలా ఉంటే పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్స్ పేలకుండా నేలపై పడిపోయి కనిపించాయి. దీంతో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెటిజన్లు, చైనా వస్తువుల మాదిరిగానే మిస్సైల్స్ కూడా పేలకుండా తుస్సుమన్నాయని కామెంట్లు చేస్తున్నారు. పాపం పాకిస్తాన్ చైనా తక్కువ ధరకు నకిలి మిస్సైల్స్ను పంపించిందని ఇది గమనించక పాక్ వాటిని భారత్ పై ప్రయోగించి పరువు తీసుకుందని కామెంట్లు చేస్తున్నారు.