McDonald burger | మెక్ డొనాల్డ్స్ రూ.5 కోట్ల జరిమానా.. బర్గర్‌ ఆర్డర్ చేసిన కస్టమర్ ఏం చేశాడంటే?

by Dishanational1 |
McDonald burger | మెక్ డొనాల్డ్స్ రూ.5 కోట్ల జరిమానా.. బర్గర్‌ ఆర్డర్ చేసిన కస్టమర్ ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఫాస్ట్ ఫుడ్‌‌ని ఇష్టంగా తినేవారి ఆహార ప్రియుల సంఖ్య చాలా పెద్దది కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి గిరాకీ ఉంది. ఫాస్ట్ ఫుడ్‌‌ ఐటెమ్స్‌లో బర్గర్, పిజ్జాలకు మెక్ డొనాల్డ్స్ స్టోర్స్ పెట్టింది పేరు. అమెరికా, యూరోప్ లాంటి దేశాలతోపాటు భారతదేశంలో కూడా మెక్ డొనాల్డ్స్ ఫాస్ట్ ఫుడ్‌ ఐటెమ్స్‌కు మంచి ఆదరణ ఉంది. అలాంటి మెక్ డొనాల్డ్స్ సంస్థకు ఆరోగ్య నిబంధనల పాటించనందుకు ఒక లండన్ కోర్టు ఇటీవల రూ.5 కోట్ల జరిమానా విధించింది.

వివరాల్లోకి వెళితే.. 2021 సంవత్సరంలో మెక్ డొనాల్డ్స్ నుంచి ఒక మహిళా కస్టమర్ చీజ్ బర్గర్‌ ను ఆర్డర్ చేసింది. బర్గర్‌పై ఉన్న రాపర్ ఓపెన్ చేసి తినబోతుండగా దుర్వాసన వచ్చింది. దీంతో మొత్తం ఓపెన్ చేసి చూడగా అందులో ఎలుక వ్యర్థాలు కనిపించాయి. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఆ కస్టమర్ ఆరోగ్య అధికారులకు కంప్లెయింట్ చేసింది. ఆమె చేసిన కంప్లెయింట్ ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు స్టోర్‌ మొత్తాన్ని పరిశీలించారు.

అక్కడ ఏ మాత్రం శుభ్రత లేకుండా ఉండటం, స్టోర్ మొత్తం ఎలుక వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ కనిపించడం, స్టాఫ్‌ కూడా ఏ మాత్రం శుభ్రత లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆరోగ్య భద్రతల దృష్ట్యా ఆ స్టోర్‌ని 10 రోజుల పాటు అధికారులు సీల్ చేశారు.

దీంతో స్టోర్ యాజమాన్యంపై మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులను విచారణ చేపట్టిన కోర్టు రెండేళ్ల తర్వాత 2023 మే నెలలో మెక్‌డొనాల్డ్‌కి రూ.5 కోట్ల జరిమానా విధించింది.

ఆరోగ్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మెక్ డొనాల్డ్ సంస్థ బాధితురాలికి సుమారు రూ.4.8 కోట్ల జరిమానా చెల్లించాలి. అలాగే, చట్టపరమైన చర్యల కోసం మహిళ చేసిన ఖర్చు రూ.22.6 లక్షలు కాగా, అదనంగా రూ.19,537 మొత్తం రూ.5 కోట్ల పెనాల్టీగా చెల్లించాల్సి ఉందని సమాచారం.

ఈ మొత్తం వ్యవహారంపై మెక్ డొనాల్డ్స్ సంస్థ స్పందిస్తూ తాము ఆరోగ్య, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తామని.. కానీ ఈ ఒక్క సంఘటన జరిగిన స్టోర్‌లో తప్పు జరిగినందుకు క్షమాపణలు తెలిజేస్తున్నామని తెలిపారు.

Next Story

Most Viewed