పట్టాల మధ్య భారీ పేలుడు... గాల్లోకి ఎగిరి కిందపడ్డ ట్రైన్ బోగీలు

by S Gopi |   (  Updated:2023-02-16 14:10:40  IST  )

పాకిస్థాన్ లో మరో భారీ పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే... పాకిస్థాన్ లోని చిచవత్నిలో... Major Explosion in Pakistan

పట్టాల మధ్య భారీ పేలుడు... గాల్లోకి ఎగిరి కిందపడ్డ ట్రైన్ బోగీలు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ లో మరో భారీ పేలుడు సంభవించింది. వివరాల్లోకి వెళితే... పాకిస్థాన్ లోని చిచవత్నిలో భారీ బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ చిచవత్ని రైల్వే స్టేషన్ ను క్రాస్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. పేలుడు దాటికి జాఫర్ ట్రైన్ బోగీలు, పట్టాలు చెల్లాచెదురయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇది పాకిస్థాన్ లో ఈ సంవత్సరంలో ఇది మూడో ఘటన.

Also Read...

దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ పై రూ. 22.20 పెంపు

Next Story