- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయెల్లో అమెరికన్ల భద్రతకు గ్యారంటీ ఇవ్వలేం.. యూఎస్ ఎంబసీ పోస్ట్
జెరూసలెంలోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-అమెరికా కుటమి ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో జెరూసలెంలోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) తమ పౌరులకు అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇజ్రాయెల్లో ఉన్న అమెరికన్లను సురక్షితంగా తరలించే (Evacuate) స్థితిలో తాము లేమని, వారి భద్రతకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని ఎంబసీ స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఉద్రిక్తతలు కీలక దశకు చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు టెహ్రాన్పై దాడులు కొనసాగిస్తుండటంతో ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగుతోంది. ఈ క్రమంలో యూఎస్ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తదుపరి నోటీసు వచ్చేవరకు తమ నివాసాలకే పరిమితం కావాలని (Shelter in place) రాయబార కార్యాలయం ఆదేశించింది.
ప్రయాణాలపై ఎంబసీ కీలక సూచనలు..
ఇజ్రాయెల్ విడిచి వెళ్లాలనుకునే వారి కోసం ఎంబసీ కొన్ని ప్రత్యామ్నాయాలను సూచించినప్పటికీ, వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కోరింది. ఈజిప్టులోకి వెళ్లడానికి ఇజ్రాయెల్ పర్యాటక శాఖ షటిల్ సర్వీసులను ఏర్పాటు చేసింది. ఇందుకోసం పౌరులు ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ప్రయాణ మార్గాలను ఎంచుకోవాలా? వద్దా? అనే దానిపై ఎంబసీ ఎటువంటి సిఫార్సు చేయడం లేదు. ‘ఒకవేళ మీరు ఈ మార్గంలో వెళ్లాలనుకుంటే, అది మీ సొంత రిస్క్. మీ భద్రతకు అమెరికా ప్రభుత్వం హామీ ఇవ్వదు’అని ఎంబసీ తన ప్రకటనలో తేల్చి చెప్పింది. జోర్డాన్ వెళ్లాలనుకునే వారు ఐలాట్ (Eilat) వరకు షటిల్ సర్వీసులో వెళ్లి, అక్కడి నుండి స్వతంత్రంగా టాక్సీల ద్వారా ఇసాక్ రాబిన్ బోర్డర్ క్రాసింగ్కు చేరుకోవాలని సూచించింది.
ముదురుతున్న యుద్ధం..
గల్ఫ్ దేశాలతో పాటు చమురు, సహజ వాయువు ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండటంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధ లక్ష్యాలు లేదా ముగింపుపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తుండటంతో, ఈ ఘర్షణ మరికొంత కాలం కొనసాగేలా కనిపిస్తోంది.






