ముగ్గురు సీనియర్ ఇస్లామిక్ తీవ్రవాద నాయకులను మట్టుబెట్టిన ఇజ్రాయెల్

by Disha Web Desk 9 |
ముగ్గురు సీనియర్ ఇస్లామిక్ తీవ్రవాద నాయకులను మట్టుబెట్టిన ఇజ్రాయెల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇస్లామిక్ జిహాద్‌కు చెందిన ముగ్గురు సీనియర్ కమాండర్లను ఇజ్రాయెల్ గాజా వైమానిక దాడుల్లో హతమార్చింది. దీనిని స్పష్టం చేస్తూ పాలస్తీనా అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం మిలిటెంట్ గ్రూపుపై దాడులు ప్రారంభించింది. రక్షణ మంత్రి యోవ్ గాలంట్ దీనిని "ఖచ్చితమైన" ఆపరేషన్ అని పిలిచారు. "ఇజ్రాయెల్ ప్రజలకు హాని కలిగించే ఏ ఉగ్రవాది అయినా పశ్చాత్తాప పడతారు" అని గ్యాలంట్ అన్నారు.

Next Story