ఇజ్రాయెల్ వైమానిక దాడి.. హమాస్ నావల్ ఫోర్స్-లింక్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను ద్వంసం

by Disha Web Desk 12 |
ఇజ్రాయెల్ వైమానిక దాడి.. హమాస్ నావల్ ఫోర్స్-లింక్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను ద్వంసం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్-పాలస్థినాల మధ్య యుద్ధం తీవ్ర తరం అయింది. దీంతో ఇజ్రాయెల్ వైమానిక దళం హమాస్ నావల్ ఫోర్స్-లింక్డ్ హెడ్‌క్వార్టర్స్‌ను ధ్వంసం చేసింది.అలాగే హమాస్ ఉగ్రవాదుల ప్రధాన స్థావరం, అలాగే వారికి ఫడింగ్ సేకరించే ఇస్లామిక్ బ్యాంకును కూడా ఇజ్రాయెల్ వైమానిక దళం నెలమట్టం చేసింది. ఈ సంఘర్షణలో 700 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 2,100 మందికి పైగా గాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో 413 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2,300 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు హమాస్ ఉగ్రస్థావరలపై దాడులు చేసి పేల్చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ యుద్ధం కారణంగా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అయ్యే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Next Story