- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా లేదా ఇజ్రాయెల్ అనుకుంటే యుద్ధం ఆగదు - ఇరాన్
ఇరాన్ సుప్రీం లీడర్ వ్యక్తిగత సలహాదారులు కీలక ప్రకటన చేశారు. యుద్ధం మేము అనుకుంటేనే ఆగుతుందని వెల్లడించాడు.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు పది రోజులుగా ఈ మూడు దేశాల మధ్య భయంకరమైన యుద్ధం కొనసాగుతోంది. చర్చలకు రావాలని అమెరికా ఆఫర్ ఇచ్చినప్పటికీ, ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది.
అయితే ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ వ్యక్తిగత సలహాదారులు కీలక ప్రకటన చేశారు. యుద్ధం మేము అనుకుంటేనే ఆగుతుందని వెల్లడించాడు. అమెరికా లేదా ఇజ్రాయెల్ అనుకుంటే యుద్ధం ఏ మాత్రం ఆగబోదని.. మేం తలుచుకుంటేనే యుద్ధం ఆగుతుందన్నారు. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ వ్యక్తిగత సలహాదారులు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మంగళవారం రోజున ఇరాన్ లోని టెహ్రాన్ నగరాన్ని టార్గెట్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ భయంకరంగా దాడులు చేస్తున్నాయి. దీంతో చాలా మంది సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ బాంబుల దాడుల తరుణంలో మంగళవారం టీవీ ప్రసారాలు ఆగిపోయినట్లు సమాచారం. ఇక అటు ఈ యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన కూడా చేశారు. మరో నెల రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగుతుందని అనుకున్నామన్నారు. కానీ రాబోయే ఐదు రోజుల్లో మాత్రమే యుద్ధం ఫినిష్ చేస్తామని తాజాగా ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ మూలాలను దెబ్బలు కొట్టామని, ఏ క్షణమైన తమ కాళ్ల దగ్గరికి వస్తుందని వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్.






