భారతీయ దంపతులకు 33ఏళ్ల జైలు శిక్ష: బ్రిటన్ కోర్టు సంచలన తీర్పు

by Dishanational2 |
భారతీయ దంపతులకు 33ఏళ్ల జైలు శిక్ష: బ్రిటన్ కోర్టు సంచలన తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన దంపతులకు బ్రిటన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ స్మగ్గింగ్ కేసులో దోషులుగా తేలడంతో కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ(ఎన్సీఏ) వివరాల ప్రకారం.. వెస్ట్ లండన్‌లోని ఈలింగ్‌లో నివాసముంటున్న ఆర్తి ధీర్, కవల్ జిల్‌సిన్హ్ రైజాడాలు కొంత కాలంగా డ్రగ్స్ స్మగ్గింగ్ చేస్తున్నారు. 2019 నుంచి ఆస్ట్రేలియాకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరినీ 2021లో బ్రిటన్‌లోని హాన్‌వెల్ నగరంలో అరెస్టు చేశారు. అయితే వీరు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు విడిచిపెట్టారు. కానీ విచారణ నిమిత్తం వారిని 2023లో మళ్లీ అరెస్టు చేశారు. దీనిపై అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతుండగా..తాజాగా వారు దోషులుగా తేలడంతో కోర్టు శిక్ష విధించింది. కాగా, 2021లో అరెస్టు టైంలో పోలీసులు దంపతుల ఇంట్లో రూ.5.26 లక్షల విలువైన బంగారు, వెండి బిస్కెట్లు, సుమారు రూ.77లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనీలాండరింగ్ అభియోగాలు సైతం నమోదు చేశారు. దంపతులిద్దరూ విమాన సర్వీసులో పని చేశారని, ఆ అవగాహనతోనే సులువుగా స్మగ్లింగ్ చేసేవారని అధికారులు తెలిపారు.

ఇండియాలో దత్తత పుత్రుడి హత్య

యూకేకు వెళ్లక ముందు దంపతులిద్దరూ 2015లో ఓ బాలుడిని దత్తత తీసుకున్నారు. అనంతరం 2017లో ఆ బాలుడిని హత్య చేశారు. అయితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే బిడ్డను దత్తత తీసుకున్నారని ఆపై కిడ్నాప్ చేసి బాలుడిని చంపారని పోలీసులు తెలిపారు. దీంతో వారిద్దరినీ భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌ను కోరగా..అందుకు బ్రిటన్ ప్రభుత్వం తిరస్కరించింది.


Next Story