- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్-ఈయూ మధ్య 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'.. దావోస్లో ఈయూ ఛీప్ కీలక ప్రకటన
భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైందని యూరోపియన్ కమిషన్ ఛీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైందని యూరోపియన్ కమిషన్ ఛీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రకటించారు. మంగళవారం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో ఆమె ప్రసంగిస్తూ, ఈ ఒప్పందాన్ని కొందరు 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' (అన్నిటికీ మూలమైన అతిపెద్ద ఒప్పందం)గా అభివర్ణిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా దాదాపు 200 కోట్ల మంది జనాభాతో కూడిన భారీ మార్కెట్ ఏర్పడుతుంది. ఇది ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి (GDP)లో దాదాపు నాలుగో వంతు వాటాను కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాలతో వాణిజ్యం చేయడం వల్ల యూరప్కు 'ఫస్ట్-మూవర్' (ప్రథమ అవకాశ) ప్రయోజనం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత పర్యటన ఖరారు..
దావోస్ పర్యటన ముగిసిన వెంటనే తాను భారత్లో పర్యటించనున్నట్లు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వెల్లడించారు. "ఇంకా కొంత పని బాకీ ఉంది, కానీ మేము ఒక చారిత్రాత్మక ఒప్పందానికి చేరువలో ఉన్నాం" అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ శతాబ్దపు ఆర్థిక శక్తి కేంద్రాలతో వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవాలని యూరప్ ఆకాంక్షిస్తోందని ఆమె తెలిపారు. "లాటిన్ అమెరికా నుంచి ఇండో-పసిఫిక్ ప్రాంతం వరకు.. యూరప్ ఎప్పుడూ ప్రపంచంతో మమేకమవ్వడానికే మొగ్గు చూపుతుంది. ప్రపంచం కూడా యూరప్తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉంది" అని ఆమె స్పష్టం చేశారు.






