దేశంలోనే ఉన్నా : ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ

by Dishanational2 |
దేశంలోనే ఉన్నా : ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ
X

కీవ్: దేశం విడిచి పోలాండ్ వెళ్లారన్న రష్యా ఆరోపణలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ స్పందించారు. తాను రాజధాని నగరంలో కీవ్‌లో‌నే ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రాం ద్వారా వీడియో సందేశం ఇచ్చారు. 'నేను కీవ్ నగరంలోనే ఉన్నాను. ఇక్కడి నుంచే పనిచేస్తున్నాను. ఎవరూ ఎక్కడికీ పారిపోలేదు' అని పోస్ట్ చేశారు. అంతకుముందు రష్యా ప్రతినిధి మాట్లాడుతూ జెలెన్‌స్కీ ఉక్రెయిన్ విడిచి పోలాండ్ వెళ్లారని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తున్నప్పటికీ జెలెన్ స్కీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా‌లో చురుగ్గా ఉంటున్నారు. తరుచూ ఉక్రేనియన్ సార్వభౌమాధికారం గురించి మాట్లాడుతూ.. రష్యాపై పోరులో ధీటుగా స్పందిస్తున్నామని చెబుతున్నారు.



Next Story

Most Viewed