- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
అమెరికాలో మరోసారి గన్ కల్చర్ గర్జించింది. ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు.

దిశ, వెబ్డెస్క్: అమెరికాలో మరోసారి గన్ కల్చర్ గర్జించింది. అయోవా రాష్ట్రం మస్కటీన్లో సోమవారం మధ్యాహ్నం 12:15 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మస్కటీన్ కౌంటీ జాయింట్ కమ్యూనికేషన్స్ సెంటర్ (MUSCOM)కు పార్క్ ఎవెన్యూలోని 200 బ్లాక్లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసు అధికారులు, అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు తుపాకీ గాయాలతో మరణించినట్లు పోలీసులు గుర్తించారు.
అనుమానితుడి ఆత్మహత్య
పోలీసులు అక్కడికి చేరుకునే ముందే ఆ ఇల్లు వదిలి వెళ్లిన ఒక వ్యక్తిని మస్కటీన్కు చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లీస్ మెక్ఫార్లాండ్గా గుర్తించారు. ఆ తర్వాత కాసేపటికే పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ సమీపంలోని రివర్ఫ్రంట్ ట్రైల్పై మెక్ఫార్లాండ్ తలకు తుపాకీ గాయంతో పడి ఉండటాన్ని అధికారులు కనుగొన్నారు. అతను తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. అధికారులు, వైద్య సిబ్బంది అతనికి చికిత్స అందించేందుకు ప్రయత్నించినప్పటికీ, అతడు అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.
ఈ కేసు ప్రాథమిక విచారణలో భాగంగా, ఈ ఘటనలో మరికొంతమంది కూడా బాధితులు ఉండవచ్చనే సమాచారం పోలీసులకు అందింది. ఈ క్రమంలో మిల్ స్ట్రీట్లోని 1500 బ్లాక్లో ఉన్న ఒక నివాసంలో తుపాకీ గాయంతో మరణించిన మరొక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ తర్వాత గ్రాండ్వ్యూ ఎవెన్యూలోని 'విల్లిట్స్ మెటల్వర్క్స్' అనే వ్యాపార సంస్థకు చేరుకున్న పోలీసులు, అక్కడ కూడా తుపాకీ గాయంతో మరణించిన మరో వ్యక్తిని గుర్తించారు. "ప్రాథమిక విచారణ ప్రకారం.. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘోర కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది" అని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మరణించిన బాధితులంతా నిందితుడైన మెక్ఫార్లాండ్ కుటుంబ సభ్యులేనని భావిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత రావలసి ఉంది.






