- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. నలుగురు మృతి
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలో జరిగిన కాల్పులు కలకలం రేపాయి.

X
దిశ, వెబ్డెస్క్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. స్టాక్ టన్ లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపింది. వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకూ ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.
స్టాక్ టన్ లోని బంకెట్ హాల్ లో ఓ చిన్నారి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో.. జనాల్లో కలిసిపోయిన వ్యక్తి ఉన్నట్టుండి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Next Story






