BREAKING: కుల్గాంలో ఎన్‌‌కౌంటర్!

by Ajay Maddhiboyina |

పాహల్గామ్ ఘటన తరవాత భారత ఆర్మీ కశ్మీర్‌ను జల్లెడ పడుతోంది. ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తోంది.

BREAKING: కుల్గాంలో ఎన్‌‌కౌంటర్!
X

దిశ‌, వెబ్ డెస్క్: పాహల్గామ్ ఘటన తరవాత భారత ఆర్మీ కశ్మీర్‌ను జల్లెడ పడుతోంది. ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తోంది. క‌నిపిస్తే కాల్చి ప‌డేయాల‌ని ఆర్మీ వేట కొన‌సాగిస్తోంది. తాజాగా కుల్గాంలో ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది. కుల్గాం నుండి అనంతనాగ్ వరకు అక్కడ నుండి కుప్‌వరా సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వహించింది. ఈ క్ర‌మంలో గుడ్డర్ ప్రాంతంలో ఆర్మీకి ఉగ్రవాదులకు గన్ ఫైట్ జరిగినట్టు తెలుస్తోంది. కుప్‌వరాలో సీక్రెడ్ డెన్ క‌నుక్కున్న ఆర్మీ 175 మంది అనుమానితుల‌ను సైతం అదుపులోకి తీసుకుని వారి వ‌ద్ద నుండి ఆయుదాలు స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు ఇప్పటి వ‌ర‌కు 5 ఉగ్ర‌వాదుల ఇండ్ల‌ను ఆర్మీ కూల్చివేసింది.

Next Story