నడి సముద్రంలో నౌకపై దాడి.. పాకిస్తాన్‌ హస్తం ఉందని అనుమానం?

by Disha Web Desk 2 |
నడి సముద్రంలో నౌకపై దాడి.. పాకిస్తాన్‌ హస్తం ఉందని అనుమానం?
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ సమీపంలో అరేబియా మహా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. పోరు బందర్ పోర్టుకు 220 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 9న యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ నుంచి బయలుదేరిన ఈ నౌక డిసెంబర్ 25 నాటికి మంగళూరు పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో అనూహ్యంగా డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా నౌకలో మంటలు చెలరేగాయి. దాడి సమయంలో మొత్తం 21 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 20 మంది భారతీయులు, ఒక వియత్నాంకు చెందిన పౌరుడు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విషయం తెలుసుకున్న కోస్ట్‌గార్డ్ అధికారులు వెంటనే పరిస్థితిపై ఆరా తీసి ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఊపిరిపీల్చుకున్నారు. అంతేకాదు.. ఈ డ్రోన్ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.

Next Story