- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఒక్క భయంతోనే ఇరానే మమ్మల్ని సంప్రదించింది : ట్రంప్
ఇరాన్ తమతో డీల్ చేసుకోవాలని అనుకుంటోందని, ఇందులో భాగంగానే తమను సంప్రదించినట్లు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ తో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ వేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తమతో డీల్ చేసుకోవాలని అనుకుంటోందని, ఇందులో భాగంగానే తమను సంప్రదించినట్లు షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక ప్లాంట్స్ ను తాము పేల్చేయాలని అనుకున్నట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. 10 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెట్టి దీనిని నిర్మించారని వివరించారు. ఇంత ఖర్చుతో నిర్మించిన విద్యుత్ ఉత్పాదక ప్లాంట్లను తాము ఒక్క దెబ్బతో కూల్చివేయగలమని ట్రంప్ హెచ్చరించారు. ఇది కూలిపోవాలని ఇరాన్ అనుకోవడం లేదని స్పష్టం చేశారు.
అందువల్లే ఇరాన్ వాళ్లు, డీల్ కోసం తమకు కాల్ చేసినట్లు పేర్కొన్నారు. మేం చేయలేదని వివరించారు. అయితే ఈ డీల్ నేపథ్యంలో ఇరాన్ కు సంబంధించిన ఓ ముఖ్య నాయకుడితో మాత్రమే చర్చలు జరిపినట్లు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీతో తానేమీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అదే సమయంలో ఇరాన్ మరో రకంగా స్పందిస్తోంది. తామేమి అమెరికాతో చర్చలు జరపలేదని పేర్కొంది. అయితే ట్రంప్ చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఇరాన్ దెబ్బకు అతడు భయపడిపోయాడని సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్స్ మొదలుపెట్టారు జనాలు.






