ఇజ్రాయెల్‌పై దాడి చేయొద్దు..ఇరాన్‌కు బైడెన్ వార్నింగ్

by Dishanational2 |
ఇజ్రాయెల్‌పై దాడి చేయొద్దు..ఇరాన్‌కు బైడెన్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి పాల్పడబోతుందన్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్‌పై దాడి చేయొద్దని ఇరాన్‌ను హెచ్చరించారు. అటాక్ చేసే ఆలోచనలు మానుకోవాలని సూచించారు. ‘ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా అండగా ఉంటుంది. ఆ దేశానికి మద్దతిస్తాం. ఇజ్రాయెల్‌ను కాపాడటానికి కృషి చేస్తాం. దాడికి పాల్పడితే ఇరాన్ విజయం సాధించలేదు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఇజ్రాయెల్‌పై ఇరాన్ తప్పకుండా దాడి చేస్తుందని భావిస్తున్నట్టు వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాగా, ఈ నెల 1న ఇజ్రాయెల్ డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేయగా..ఆరుగురు అధికారులు మరణించారు. దీంతో అప్పటి నుంచి ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ చెబుతోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. మరోవైపు ఇజ్రాయెల్‌లోని సైనిక లక్ష్యాలపై దాడి చేసేందుకు ఇరాన్ 100కి పైగా క్షిపణులు, డ్రోన్‌లను సిద్ధం చేసిందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమై ఇజ్రాయెల్, ఇరాన్ లలోని తమ పౌరులకు అడ్వైజరీని జారీ చేశాయి.



Next Story