ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాన్ భీభత్సం.. 500 దాటిన మరణాల సంఖ్య

by Dishafeatures2 |
ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాన్ భీభత్సం.. 500 దాటిన మరణాల సంఖ్య
X

లిలింగ్వో: ఆగ్నేయ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల ధాటికి పలు ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 500 దాటిందనిఅధికారులు తెలిపారు. గత నెలలో ప్రారంభమైన ఈ తుఫాన్ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. చరిత్రలో మునుపెన్నడు లేని దీర్ఝకాల తుఫాన్ గా పేర్కొన్నారు. ఒక్క మలావీలోనే 400 కు పైగా మరణాలు చోటుచేసుకున్నాయని అధ్యక్షుడు లాజరస్ ఛక్వేరా తెలిపారు. ఈ క్రమంలో భారీ నష్టంతో 14 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు.

దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మొజాంబిక్ లో 67 మంది చనిపోయినట్లు ఆ దేశ అధ్యక్షుడు ఫిలిపి న్యూసీ తెలిపారు. సుమారు 50 వేల మందికి పైగా నిరాశ్రయులు అయ్యారని వెల్లడించారు. తుఫాన్ తీవ్రతకు భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు.


Next Story

Most Viewed