కర్నాటక సర్కార్‌ కీలక నిర్ణయం

by Ajay Maddhiboyina |

క‌ర్నాట‌క స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో మ‌ళ్లీ కుల‌గ‌ణ‌న నిర్వ‌హించాల‌ని నిర్ణయించింది.

కర్నాటక సర్కార్‌ కీలక నిర్ణయం
X

దిశ‌, వెబ్ డెస్క్: క‌ర్నాట‌క స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో మ‌ళ్లీ కుల‌గ‌ణ‌న నిర్వ‌హించాల‌ని నిర్ణయించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోగా మ‌ళ్లీ కుల‌గ‌ణ‌న నిర్వ‌హిస్తామ‌ని డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ప్ర‌క‌టించారు. క‌ర్నాట‌క‌లో చివ‌రిసారిగా 2015లో సిద్ద‌రామ‌య్య సీఎంగా ఉన్న స‌మ‌యంలో కుల స‌ర్వే నిర్వ‌హించారు. ఈ స‌ర్వే వివాదాస్పద‌మైంది. ఈ స‌ర్వేను అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు వ్య‌తిరేఖించారు.

ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో అధికారికంగా స‌మ‌ర్పించ‌బడిన డేటాలో వోక్క‌లిగ‌, వీర‌శైవ‌-లింగాయ‌త్ వ‌ర్గాలు మ‌రియు ఇత‌ర వెనుక‌బ‌డిన వ‌ర్గాల మ‌ధ్య అంత‌రాల‌ను మ‌రింత పెంచింది. దీంతో ప‌లు వ‌ర్గాల వాళ్లు డిమాండ్ చేయ‌డంతో అధిష్టానం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అంతే కాకుండా 60 నుండి 80 రోజుల్లో తిరిగి కుల‌గ‌ణ‌న పూర్తి చేయాల‌ని అధిష్టానం క‌ర్నాట‌క ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం జ‌నాభా గ‌ణ‌న షెడ్యూల్ ప్ర‌క‌టించిన వెంట‌నే క‌ర్నాట‌క ప్ర‌భుత్వం కూడా మ‌రోసారి కుల‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని ఆలోచిస్తోంది.

Next Story