ఘోర ప్రమాదం.. వంతెన కూలి 32 మంది మృతి

by Naga Rani Yarlagadda |

వంతెన కూలి 32 మంది చనిపోయిన విషాద ఘటన ఆఫ్రికా దేశమైన కాంగోలో చోటుచేసుకుంది.

ఘోర ప్రమాదం.. వంతెన కూలి 32 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: వంతెన కూలి 32 మంది చనిపోయిన విషాద ఘటన ఆఫ్రికా దేశమైన కాంగోలో చోటుచేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలడంతో ఈ దుర్ఘటన జరిగింది. బ్రిడ్జి కూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లువాలాబా ప్రావిన్స్ లోనికలాండో సైట్లో శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మైనింగ్ జరుగుతున్న ఈ సైట్లో ప్రతిరోజూ వందలాది కార్మికులు పనిచేస్తుంటారు. అక్కడ కాల్పుల శబ్దం వినిపించగా.. కార్మికులు ఒక్కసారిగా వంతెనపై నుంచి పరుగులు తీయడంతో కెపాసిటీకి మించిన లోడ్ కారణంగా వంతెన కూలిపోయినట్లు మైనింగ్ ఏజెన్సీ పేర్కొంది. కాంగోలో ఈ రాగి మైనింగ్ ఆధారంగా 15-20 మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. కాగా.. కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెప్తున్నాయి.

Next Story