- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జనాభా పెంచేందుకు చైనా కొత్త నిర్ణయం.. పెళ్లి కాకున్నా తల్లి కావొచ్చు
by Disha Web Desk 12 |
X
బీజింగ్: జనాభాలో చైనాను భారత్ రెండో స్థానానికి నెట్టేసింది. డ్రాగన్ దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోయి వృద్ధుల సంఖ్య భారీగా పెరగడంతో చైనా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పెళ్లి కాకున్నా, విడాకులు తీసుకున్న, వితంతువులైనా పిల్లల్ని కనొచ్చని స్పష్టం చేసింది. అవివాహిత మహిళలు సైతం ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ చికిత్సను పొందేందుకు అనుమతి ఇచ్చింది.
వారికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కూడా ఇస్తామని చెప్పింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకొని నైరుతి సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డులో విడాకులు తీసుకున్న 33 ఏళ్ల మహిళ ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది. చాలా మంది ఒంటరి మహిళలూ ఐవీఎఫ్ సెంటర్లకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఐవీఎఫ్ ప్రక్రియ దేశంలో ఓ పెద్ద మార్కెట్ గా విస్తరించే అవకాశం ఏర్పడిందని వైద్య నిపుణులు అంటున్నారు.
Next Story