- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. మగ్గురు మృతి

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో (America) మరోసారి కాల్పుల (Firing) మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటినియల్ పార్కులో ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) నిర్వహించిన వెస్ట్ ఫెస్ట్ కార్నివాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకు పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో 8 నెలల శిశువు, 18 ఏళ్ల యువకుడు, 41 ఏళ్ల మహిళ ఉన్నారు.
కాగా, రెండు గుంపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో.. 16 ఏళ్ల యువకుడు వెంటనే తుపాకీతో వారిపైకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజల్లో భయం అలముకుంది. అధికారులు భద్రతను పెంచారు. ఈ హింసాత్మక ఘటనలే చెలరేగితే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు.
Next Story






