అమెరికా దాడుల్లో ఇరాన్ బ్రిడ్జిలు ధ్వంసం

by velandi.Saikiran |

అమెరికా దాడుల్లో ఇరాన్ బ్రిడ్జిలు ధ్వంసం అయ్యాయి.

అమెరికా దాడుల్లో ఇరాన్ బ్రిడ్జిలు ధ్వంసం
X

దిశ‌, వెబ్ డెస్క్: అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శాంతి ఒప్పందం జరిగినప్పటికీ..రెండు దేశాలు రూల్స్ బ్రేక్ చేసి తెగించాయి. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అమెరికా దాడుల్లో ఇరాన్ లోని పలు బ్రిడ్జిలు ధ్వంసం అయ్యాయి. హోర్మోజ్ గాన్ ప్రావిన్స్ లోని బందర్ అబ్బాస్-లార్ రూట్ లోని ట్రాన్స్ పోర్ట్ కారిడార్ లో 6 వంతెన‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హార్ముజ్ జలసంధికి పక్కనే బందర్ అబ్బాస్ ప్రాంతం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మిలిటరీ హబ్ తో పాటు బిగ్గెస్ట్ పోర్టు ఉంటుంది. అయితే బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో పోర్టుకు మిస్సైల్స్, ట్రూప్స్ తరలింపు చేయడంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థ కీలక ప్రకటన చేసింది.

Next Story