సింగపూర్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఉరిశిక్ష

by Disha Web Desk 12 |
సింగపూర్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తికి ఉరిశిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన భారత సంతతికి చెందిన వ్యక్తికి సింగపూర్ బుధవారం ఉరిశిక్షను అమలు చేసింది. తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తి సుమారు 1,017.9 గ్రాముల గంజాయి రవాణాకు పాల్పడినందుకు దోషిగా నిర్ధారించబడింది. అయితే ఇంత భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడటం.. సింగపూర్ మరణశిక్షకు రెట్టింపు. దీంతో అతనికి సింగపూర్ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. అయితే ఈ ఉరిని "అత్యవసరంగా పునఃపరిశీలించాలని" సింగపూర్ కోసం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం విజ్ఞప్తి చేసినప్పటికీ ఉరిశిక్ష అమలు చేయబడింది.



Next Story

Most Viewed