భూ వివాదం.. మహిళను కిందపడేసి తొక్కి.. కత్తితో దాడి చేసిన ముగ్గురు.. (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-26 02:14:01  IST  )

బంగ్లాదేశ్‌ దినాజ్‌పూర్ జిల్లాలోని మోనిపూర్, బోచాగంజ్‌లో దారుణం చోటు చేసుకుంది. 44 ఏళ్ల హిందూ మహిళ నీలా రాణిని బాబుల్ రెహమాన్, తారికుల్ ఇస్లామ్, షరీఫుల్ ఇస్లామ్ అనే ముగ్గురు వ్యక్తులు కింద పడేసి తొక్కి.. కత్తితో దాడి చేశారు.

భూ వివాదం.. మహిళను కిందపడేసి తొక్కి.. కత్తితో దాడి చేసిన ముగ్గురు.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌ దినాజ్‌పూర్ జిల్లాలోని మోనిపూర్, బోచాగంజ్‌లో దారుణం చోటు చేసుకుంది. 44 ఏళ్ల హిందూ మహిళ నీలా రాణిని బాబుల్ రెహమాన్, తారికుల్ ఇస్లామ్, షరీఫుల్ ఇస్లామ్ అనే ముగ్గురు వ్యక్తులు కింద పడేసి తొక్కి.. కత్తితో దాడి చేశారు. భూ వివాదం కారణంగా ఆమెపై ఎటాక్ చేశారని.. నీలా రాణి పొలం నుంచి తిరిగి వస్తుండగా దాడి జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అయితే మత మార్పిడి కూడా ఇందుకు కారణమనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. దాడి తీవ్రత ఆమె కుటుంబం గ్రామం నుంచి పారిపోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస మరింత పెరిగిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story