- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
24 గంటల్లోనే 90 మంది పాలస్తీనియన్లు మృతి: గాజా మంత్రిత్వ శాఖ వెల్లడి
by samatah |
![24 గంటల్లోనే 90 మంది పాలస్తీనియన్లు మృతి: గాజా మంత్రిత్వ శాఖ వెల్లడి 24 గంటల్లోనే 90 మంది పాలస్తీనియన్లు మృతి: గాజా మంత్రిత్వ శాఖ వెల్లడి](https://www.dishadaily.com/h-upload/2024/02/26/311262-isreyal-hamas-war.webp)
X
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లోనే 90 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా..164 మంది గాయపడ్డట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దీంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 29,782కి చేరినట్టు తెలిపింది. అంతేగాక 70,043 మంది క్షతగాత్రులు కాగా.. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపింది. అనేక మంది ఆశ్రయిం పొందుతున్న రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పాలస్తీనా ప్రధాని మహ్మద్ సతాయే సహా మొత్తం ప్రభుత్వం రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. పాలస్తీనాలో కొత్త రాజకీయ నిర్మాణాన్ని రూపొందించాలని అమెరికా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
Next Story